ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు .
ప్రస్తుతం మొన్న జరిగిన చెన్నై వన్ డే మ్యాచ్ తర్వాత రెండో వన్ డే కోసం కలకత్తాకు వచ్చిన వార్నర్ తన ట్విట్టర్ లో ‘గుడ్ మార్నింగ్ కోల్కతా, నగరంలో అద్భుత దర్శనీయ ప్రాంతాలేవో చెప్తారా’ అని పోస్టు పెట్టాడు. దీంతో బెంగాల్ టైగర్ దాదా అభిమానులు అన్నిటి కన్నా ముందుగా దాదా ఇంటిని దర్శించాలని సరదాగా కోరారు. ‘మీరు కచ్చితంగా గంగూలీ ఇంటిని దర్శించాల్సిందే. బతికున్న ఓ చక్రవర్తి రాజ్యాన్ని చూస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది’ అని వారు ట్వీటారు.