ప్రస్తుతం ఇండియా పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది .ఇప్పటికే వన్ డే సిరిస్ లో వరసగా మూడు వన్డేలలో ఓడిపోయి సిరిస్ ను కోల్పోయిన సంగతి విదితమే .నిన్న ఆదివారం కలకత్తాలో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది .దీంతో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరిస్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది .
దీంతో రానున్న రెండు మ్యాచ్ లను గెలిచి పరువును నిలుపుకోవాలని స్మిత్ సేన భావించింది .కానీ ప్రస్తుతం అంతో ఇంతో రాణిస్తున్న ఆసీస్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ గాయంతో మిగతా రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు .
నిన్న ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో అగర్ బౌండరీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో కుడి చేతి చిటికెను వేలుకు గాయమైంది.దీంతో ఎక్స్రేలో వేలు విరిగినట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలనే జట్టు వైద్యుడు సా సూచనల మేరకు అగర్ తిరుగు పయనమయ్యాడు.