Home / ANDHRAPRADESH / ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచారు .తాజాగా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను .ప్రజలకు కానీ నా నియోజక వర్గానికి ఏమి చేయలేకపోతున్నాను అని మీడియా కు చెప్పారు .దీనిపై అనంతపూరం వాసి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరును తూర్పార పడుతూ ఒక లేఖ ను రాశాడు .ఇప్పుడు అది ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది .ఆ లేఖ యొక్క సారాంశం ఉన్నది ఉన్నట్లు మీకోసం ..
అయ్యా నమస్తే…నా పేరు నర్సారెడ్డి. అనంతపురం జిల్లా వాడిని. ఇగో మా ఎంపీ జెసి దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తోన్నాడు అని విషయం విని మీకు ఒక విషయం వివరంగా చెప్దామని వచ్చా . అయ్యో నా అనంతపురం ప్రజలు, నా తాడిపత్రి జనం అని గగ్గోలు పెడతా ఉండాడు మా ఎంపీ జేసీ.సాగు నీరు లేదు ..త్రాగునీరు లేదు .సక్కగా రోడ్లు లేవు .ఎట్లా నా జనాలు బ్రతికేది అంటూ నెత్తి మీద సుత్తేస్కు కొట్టుకుంటాన్నాడు. అరె గా పొద్దు విజయ్ నగర్ కాలని మ్యాటర్లావిషయంలో కూడా నా మాట బాబు సర్కారు కానీ అధికారులు కానీ విననందుకే దుకే ఇగో రాజీనామా చేస్తున్న …నాకు ఆ స్పీకరమ్మ దొర్కలేదు..దొర్కగానే ఇచ్చేస్తా అని చెబుతుండే…ఇదంతా జూసి అనంతపురమోళ్లు…అయ్యో సామీ అట్టా సేయద్దు అని పడి ఏడుత్తారనుకుంట్నడా ఏమి…ఏమి లేదు … రాజీనామా చేసి చల్లంగా పోయిరా అనుకుంటున్నరు.

ఏంటది దుష్టశక్తులు అడ్డం పడతన్నయ్యా…ఎక్కడివయ్యా…మీరు పుట్టించినయ్ గావు ఆ శక్తులు..నువ్వు, ఆ చంద్రబాబు…మిమ్మల్ని మించిన దుస్టశత్తులుంటాయా ఈ రాష్ట్రంలో. కూలినాలి జేసుకునే జనాల్ని అప్పుడు నువ్వు, నీ తాలూకు నాయకులొచ్చి ఖాళీ జాగాలో ఇళ్లేస్కోండి…పట్టాలిప్పిస్తాం అని చెబితే గదా…పాపం ఆ ఇజయనగరం కాలనీలో బక్కోళ్లు అప్పులు సొప్పుల సేసి దుడ్లు బెట్టుకుని కొంపలు గట్టుకున్నారు. ఇప్పుడేమో మీరు మీరు గుమ్ములాడుకుని, ఆ పేదోళ్ల గుడెసెలు గలాట జేసినారు. ఛీ…ఛీ…

అంతకు ముందు ఆ పరిటాల సునీతమ్మని నమ్మి గూడా కొందరు పేదోళ్లు కొంప గూడు లేకుండా అయిపోయుండ్లే…అదే కక్కల పల్లిలో…రాప్తాడు ఎమ్మెల్యేమ్మగారు, ఆమెగారి సుపుత్రుడూ..ఇంకా ఆళ్ల తాలూకోళ్లే ఆళ్లని ఎల్లగొట్టిచ్చినారు. అయినా తెలీకడుగుతాను…అసలు ప్రభుత్వ జాగాలో జనాలు పాగా ఏస్తున్నారే అనుకో ఈ మున్సిపాలిటీ వాళ్లు అప్పుడు ఏం చేస్తున్నట్టు? పన్నులు కట్టించుకుని, కరెంటు కనెక్షన్లు ఇచ్చి, ఇప్పుడొచ్చి ఇల్లు కూల్చేయడం ఏం న్నాయం..?

సరి అసలు విసయం చెబుతాను చూడండి. మా తాడిపత్రిలో జెసి అంటేనే జనాలు చుర్రున తాచుపాములెక్క లేస్తున్నారు. ఓహో బోలెడన్ని కబుర్లు చెప్పి జనాలని బురిడీలు కొట్టించిది చాలు పొమ్మంటున్నారు. అందుకే వచ్చే ఎలక్షన్లో సింపతీ కోసం ఇప్పుడీ రాజీనామా డ్రామా మొదలేసినాడు. రాబోయే ఎన్నికల్లో ఆయన సుపుత్రుడు పవన్ రెడ్డికి సీటు ఇప్పించుకోని, జనం కోసం పదవిని వదిలేసాడన్న సింపతీని అడ్డేసుకోని మళ్లీ పీటం ఎక్కేదామని ప్లానులేస్తన్నాడు. ఇగో చెబుతున్నా అనతపురం ఓళ్లు అంత వెర్రోళ్లు గాదు జేసీ… ఏసాలు ఇక మానేసి…నువు సెప్పావుగా ఓ నాలుగెకరాలుందని ఎళ్లి ఆ చెట్టుకిందే తొంగో…ఒక్కా మాట నువ్వన్నదైతే నిజమప్పా నువ్వో ఫెయిల్యూర్ ఎంపీవి అంటూ ఒక యువకుడు రాసిన లేఖ ఏపీ రాజకీయాలను హడాలెత్తిస్తుంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat