ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గతంలో ఓ ప్రముఖ పత్రిక సంచలన సంచలన కథనాన్ని ప్రచురించింది. పశువులకి జబ్బు చేసినప్పుడు వాడే యాంటీబయోటిక్స్ నకిలీవి తయారు చేసి వాటిని ప్రభుత్వ ఆస్ప్రత్రులకు విక్రయిస్తున్నారని సదరు పత్రిక ఓ భారీ కథనాన్ని ప్రచురించింది. కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీ ప్రభుత్వ పశువైధ్యాశాలలకు సరఫరా చేస్తోందని.. అయితే సేఫ్ కంపెనీ నాసిరకం మందులు సరఫరా చేస్తోందని ఆ పత్రిక వివరించింది. ఆ నాసిరకం మందులను బర్రెలు, గొర్రెల, ఆవులకు వాడడం వల్ల వాటి ఆరోగ్యం మరింత దెబ్బ తింటోందని వెల్లడించింది.
అయితే ఈ నకిలీ మందుల వ్యవహారం పరిశోధనల్లో తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మందులు నకిలీవని అధికారులు అభ్యంతరం చెబితే వారిని బెదిరించి బలవంతంగా పశువులకు వాడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మందులను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు టోకెన్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేయాలటూ అధికారులకు స్వయంగా కోడెల శివప్రసాదరావే బెదిరిస్తున్నారని గోపిరెడ్డి చెప్పారు. స్పీకర్ ఆదేశాలను పాటించని ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ను బదిలీపై నెల్లూరు పంపించారని చెప్పారు. గుంటూరులోని చట్టుగంటల్లో ఉన్న స్పీకర్ కోడెల భవనంలోనే డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఉందని.. అందులోనే సీఈవో రవిశంకర్ అయ్యన్నార్ ఉంటున్నారని గోపిరెడ్డి చెప్పారు. ఇలా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ నోరు లేని మూగ జీవులపై కూడా నకిలీ మందులు ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ నకిలీ వ్యవహారం పై టీడీపీ సర్కార్ చర్యలు తీసుకోపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.