ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా పుస్తకాన్నే రీలీజ్ చేశారు కూడా .తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ,టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు మనవడు గంజాయితో పోలీసులకు దొరికాడు అని వార్తలు వస్తోన్నాయి .
మరోవైపు మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు భార్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కూడా .సదరు మాజీ ఎంపీ మనవడు విష్ణు తన స్నేహితులు అయిన కర్ణాటక రాష్ట్ర సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోలు ప్రజ్వల్ ,దిగంత్ లు కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు రహదారిపై మీతిమీరిన వేగంతో కారును నడుపుతూ దారిన పోతున్నవారిని డీకోట్టారు .దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు .అయితే వెంటనే తేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు .
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వార్ని అరెస్ట్ చేశారు .అంతే కాకుండా కారును తనిఖీ చేస్తుండగా బెంజ్ కార్లో సుమారు లక్ష రూపాయల విలువ చేసే గంజాయి ప్యాకెట్లు దొరికాయి అని వార్తలు వినిపిస్తున్నాయి .అయితే విష్ణు ను అరెస్ట్ చేసే సమయంలో తన స్నేహితులు తప్పించుకున్నారు అంట .ప్రస్తుతం పోలీసులు విష్ణు ను అరెస్ట్ చేసి గంజాయి ఎలా వచ్చింది దానిపై కూడా విచారిస్తున్నారు అని సమాచారం .అయిన నిఖార్సైన మహిళ ఎమ్మార్వో వనజాక్షి పై టీడీపీ ఎమ్మెల్యే అనుచరవర్గం ఒక మహిళ అని చూడకుండా అతికిరతకంగా దాడి చేస్తేనే వనజాక్షి దే తప్పు అని తేల్చిన బాబు ఈమాజీ ఎంపీ మనవాడి విషయంలో కూడా పోలీస్ లదే తప్పు అని చెబుతాడేమో ఎవరికీ ఎరుక ..