కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా నిర్ణయించినట్టు చెప్పడంతో పీసీసీ, ఏఐసీసీ నియామకాలకు సోనియాకే అధికారం ఇస్తూ తీర్మానం చేసి పంపాలని తాజా సమావేశంలో పీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ దీపావళి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్టు రాజస్థాన్కు చెందిన ఆ పార్టీ నేత సచిన్ పైలట్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.