అక్కినేని నాగ చైతన్య – సమంత ల వివాహం శుక్రవారం రాత్రి గోవాలోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంతో ఒక్కటైనా చైతూ – సామ్ల జంట శనివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అధికారికంగా సమంత అక్కినేని ఇంటి కోడలు అయ్యింది. ఈ పెళ్ళికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు.
అయితే వాళ్ళ విషయం సరే.. ఈ పెళ్లికి చైతన్యను కన్న తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మీ వచ్చిందా లేదా అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి కూతురు, హీరో వెంకటేష్, నిర్మాత సురేష్బాబుల చెల్లెలు అయిన లక్ష్మీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. అయితే చాలా కాలం తర్వాత చైతన్య ఎంగేజ్మెంట్కు హాజరైన లక్ష్మీ కొడుకు పెళ్లికి వచ్చిందా.. రాలేదా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారి పెళ్లి ఫొటోలు చాలావరకు బయటకి రాగా వాటిలో లక్ష్మీ ఫొటో ఒక్కటి కూడా కనిపించక పోవడంతో సోషల్ మీడియాలో సంధేహాలు వ్యక్తం చేస్తున్నారు.