ఇండియా లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు గట్టి ఝలక్ .ఇప్పటికే టీంఇండియా తో జరుగుతున్న టెస్ట్ వన్డే సిరిస్ లను కోల్పోయి పరువు పోగుట్టుకున్న ఆ జట్టు నేటి నుండి మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను అడనున్నది .కనీసం ట్వంటీ ట్వంటీ సిరిస్ లో గెలిచి అయిన సరే పరువు నిలుపుకోవాలని ఆశపడుతున్న ఆ జట్టుకు కెప్టెన్ స్మిత్ రూపంలో గట్టి ఝలక్ తలిగింది .
నేడు రాంచీ లో జరగనున్న టీ20 సిరీస్కు దూరంకానున్నాడు. నిన్న శుక్రవారం భుజం గాయం కారణంగా అతను జరిగిన ప్రాక్టీస్ సెషన్కు దూరం అయ్యాడు. కుడి భుజానికి గాయమైనట్లు ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలిసింది.దీంతో రెస్ట్ కోసం అతను త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. భుజం గాయంతో దూరమైనా స్మిత్ స్థానంలో టీ20లకు స్టోయినిస్ను తీసుకున్నారు. ప్రస్తుత వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.