సహజంగా అందరు ధనవంతుడు కావాలని అందరు కోరుకుంటారు. అయితే ఆ ధనం ఎలా సంపాదించాలో తెలియక సతమతం అవుతుంటారు. నిరంతర శ్రమ, పట్టుదల, మొక్కవోని దీక్ష ఉంటేనే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. కాని చాలా మంది దీనికి లక్ కూడా తోడు కావాలని నమ్ముతారు. సిరి సంపదలు సమకూరాలంటే అదృష్టం ఉండాలనే వారే దాదాపు అందరూ. అయితే డబ్బు సంపాదించుకునేందుకు, దానిని నిలబెట్టుకునేందుకు వివిధ పద్దతులను ఫాలో అవుతుంటారు. కొందరు ఏదీ కలిసిరాక, చేసిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురి అవుతుంటారు. మరి కొంత మంది డబ్బు వచ్చినా ఆ డబ్బు నిలబెట్టుకునే మార్గం తెలియక కష్టాల ఊబిలో కూరుకుపోతుంటారు. ఈ కష్టాలకు కారణం మీకు లక్ష్మి కటాక్షం లేకపోవడమే అని పండితులు చెబుతున్నారు. మరి..
అలాంటి వారు కర్పురాలతో ఇలా చేస్తే మీరు అష్ట ఐశ్వర్యాలతో తూగుతూ ఉండటం ఖాయమని పండితులు చెబుతున్నారు. ఇంతకీ కర్పూరంతో ఏం చేయాలంటే.. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మంచి దుస్తులు ధరించాలట. లక్ష్మీ దేవికి ఆవు నెయ్యితో దీపారాధాన చేయాలట. అదే సమయంలో కర్పూరం బిళ్ళలు తీసుకుని ఎర్ర గుడ్డలో మూట కట్టి, ఆ మూట ను లక్ష్మి దేవి ఫోటో ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలట. తర్వాతా తమ ఆర్ధిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి కాపాడమని ప్రార్ధించాలట. తమకు ధన ప్రాప్తి కలిగించమని సిరుల తల్లి అయిన లక్ష్మి దేవిని ప్రార్ధించి ఆ తల్లి కి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలట. పూజ పూర్తి అయిన తర్వాత ఆ కర్పూరం ఉంచిన మూట ను తీసుకెళ్ళి బీరువాలో మీరు డబ్బు, బంగారం ఎక్కువగా దాచుకునే ప్రదేశంలో ఉంచాలట. అలా ఉంచినట్టు ఎవ్వరికీ చెప్పకూడదట. చివరికి మీ భార్య/భర్త కు కూడా చెప్పకూడదట. ఇలా ఆ కర్పూరాన్ని కొన్ని వారాల పాటు అక్కడే వదిలేయాలట. అక్కడ కర్పూరం ఉన్న సంగతి పూర్తిగా మర్చి పోవాలట. ఎప్పుడైతే మీరు ఆ కర్పూరం మూట ను అక్కడ పెట్టారో ఆ సమయం నుంచే మీకు ధనం రావడం మొదలు అవుతుందని పండితుల ఉవాచ. కొన్ని వారాలు అయ్యే సమయానికి మీరు అనుకున్న పనులు సజావుగా సాగి మీకు అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయని భరోసా ఇస్తున్నారు.