Home / ANDHRAPRADESH / నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

ఏపీలో వైసీపీ వైసీపీ నూత‌న‌ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు సోమ‌వారం లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, మీడియా సమావేశానికి ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు.

అయితే ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావాల్సి ఉంది. వాస్తవానికి దసరాకే ఈ కార్యాలయం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావడంలో జాప్యం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెలలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుండటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనులను త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. తొలుత ఈరోజు పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిపి లాంభనంగా ప్రారంభిస్తారు. తర్వాత మంచి ముహూర్తం చూసుకుని జగన్ చేత ప్రారంభోత్సవం చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat