తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ను వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీనికి సంబంధించి ఈ రోజు మంగళవారం టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ వెలువరించేందుకు అనుమతి ఉత్తర్వులు అందనున్నాయి. అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అలాగే డీఎస్సీకి సంబంధించిన ఫైల్పై సంబంధిత శాఖ మంత్రి కడియం శ్రీహరి సంతకం కూడా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలకు డీఎస్సీ నోటిఫికేషన్కు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు డీఎస్సీకి ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 12 వేల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని సమాచారం .