మెరుగైన పాలన కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన జిల్లా ఆవిర్బావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో దేశం దృష్టిని సీఎం కేసీఆర్ ఆకర్షించారని, సీతారామ ఎత్తిపోతల పథకంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. అలాగే… భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. సహజ వనరులు, ఖనిజాల ఖానాచి అయినా భద్రాద్రి-కొత్తగూడెం అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.