Home / CRIME / కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?

కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?

దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్‌కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు.

వివరాలను పరిశిలిస్తే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో పెద్ద ఉద్యోగం చేస్తున్న మణిప్రసాద్ మొదటి కూతురు ఈమె. మణిప్రసాద్‌కు మొత్తం ఐదుగురు భార్యలు. ఏ ఊరికి ట్రాన్స్‌ఫర్ ఐతే ఆ ఊళ్లో మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం ఇతడికి అలవాటు. వావివరసలు మరచి ప్రవర్తించే తండ్రి మణిప్రసాద్. 12 ఏట నుంచే తనకు నరకం చూపించేవాడని బాధితురాలు చెప్తోంది. తండ్రే రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటే తోడబుట్టిన అన్నయ్యలు కూడా తండ్రిమార్గంలోనే నడుస్తూ లైంగిక వాంఛలు తీర్చుకునేవారని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది.

రాక్షసుల్లాంటి కుటుంబసభ్యుల మధ్య నరకం అనుభవిస్తున్న ఆ యువతి జులై 17న టూటౌన్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాక్షస తండ్రి మణిప్రసాద్‌ను పిలిపించి విచారించారే తప్ప అతడిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదని చెప్తోంది బాధితురాలు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే చంపేస్తానంటూ తండ్రి బెదిరించాడని ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని వాపోతోంది.

నెల్లూరులో ఉంటున్న తల్లి పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉందని ఇప్పుడు తనకు దిక్కెవరని మహిళా సంఘాలను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి, సోదరులను అరెస్ట్ చేయాలని కోరుతోంది. ఇప్పుడు కూడా పోలీసులు తన గోడు పట్టించుకోకపోతే పీఎస్ ముందే ఆత్మహత్యకు దిగుతానని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలికి ఇప్పుడు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. కూతురిపైనే లైంగిక వాంఛ తీర్చుకున్న తండ్రి, అతని కొడుకులపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat