Home / SPORTS / న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ

న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు.

 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నుంచి తన భార్యకి ఆనారోగ్యంగా ఉండటంతో ప్రత్యేక అభ్యర్థనతో తప్పుకున్న శిఖర్ ధావన్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. అయితే.. సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అశ్విన్, జడేజాలతో పాటు యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కి కూడా మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు. తొలి వన్డే వాంఖడే వేదికగా అక్టోబరు 22న జరగనుంది.

 

 

భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానె, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat