ఏపీలో ప్రస్తుతం ఒక వార్త తెగ సంచలనం రేపుతుంది .అదే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఒక ఎంపీను అధికార టీడీపీ పార్టీలో చేరడానికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సదరు ఎంపీకి వంద కోట్లు మొదటగా ఇచ్చి ..ఆ తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . అంతకు ముందు ఇదే విషయం గురించి తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ ,పత్రిక “భేరం కుదిరింది “అని టైటిల్ తో ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది .ఈ క్రమంలో సదరు ఎంపీ రాష్ట్రంలో తను ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచే అవకాశాలు లేకపోవడం ..
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరపున టికెట్ రాదు అని తెలుసుకున్న సదరు ఎంపీ బాబుతో నిన్న శుక్రవారం రాష్ట్రంలో విజయవాడలో రహస్యంగా భేటీ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .అయిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను .ఇద్దరు ఎంపీలను నోట్ల కట్టలను ,కాంట్రాక్టులను ఆశ చూపించి టీడీపీలో చేర్చుకున్నాడు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే ఈ ఎంపీ అధిక మొత్తంలో తాయిలాల కోసం ఎదురుచూసి కాస్తా వెనక టీడీపీలో చేరుతున్నారు అని నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు .