2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుప్పించిన హామీ తమను గెలిపిస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో తలో పది హేను లక్షల రూపాయలు వేస్తామని దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు .తీరా అధికారంలోకి వచ్చి మూడు ఏండ్లు అయిన కానీ ఇంతవరకు పది హేను లక్షలు కాదు కదా పది హేను రూపాయలు కూడా ఎకౌంటు లో వేయలేదు మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు .తాజాగా ఒక రైతు మాత్రం ప్రధాని మోదీపై తిరగబడ్డారు .
కేరళ రాష్ట్రంలో మనంథవాడీకి చెందిన అరవై ఎనిమిది యేండ్ల కే చాతు అనే రైతు వేసిన పంట తీవ్రంగా దెబ్బ తిన్నది .నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు .అయిన కానీ లాభం లేకపోయింది .దీంతో ఆయన ఏకంగా పీఎంఓ కార్యాలయానికి లేఖ రాశాడు .అదే ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ గత ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి ఖాతాలో పది హేను లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు .మీరు అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు వేయలేదు .
అంతే కాకుండా పంట గుట్టుబాటు ధరను తగ్గించి ..నిత్యావసర వస్తువుల ధరలను పెంచారు .దీంతో నేడు సామాన్యులు బ్రతకడమే కష్టంగా ఉంది .నల్లధనాన్ని తీసుకొచ్చి వేస్తా అని హామీ ఇచ్చారు కాబట్టి నావాటా నాకు ఇచ్చేయండి ..లేదంటే కనీసం ఐదు లక్షలు రూపాయలు నా ఖాతాలో వేయండి అంటూ తన బ్యాంకు ఖాతా వివరాలతో సహా అందులో పొందుపరిచి లేఖ రాశాడు .అయితే గతంలో ఇదే రైతు స్టార్ హీరో మమ్ముట్టి మీద కోర్టుకెళ్ళాడు .మమ్ముట్టి ఒక ప్రముఖ సబ్బుల కంపెనీ తరపున యాడ్ చేశాడు .దీంతో చాతు ఆ సబ్బును వాడాడు .కానీ తెల్లగా కాలేదు .దీంతో తను మమ్ముట్టి మీద ,ఆ సబ్బుల కంపెనీ మీద కోర్టు కెళ్ళి యాబై వేల రూపాయలు నష్ట పరిహారం కావాలని పిటిషన్ వేశాడు .దీంతో సబ్బుల కంపెనీ దిగొచ్చి క్షమాపణలు చెప్పి మరి ముప్పై వేల రూపాయలను చెల్లించింది .