2014 ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రాల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వందేళ్ళకు పైగా చరిత్ర కల్గి ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు .
కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ కుమారుడే అనిల్ శర్మ ..అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మండి నియోజక వర్గం నుండి పోటి చేయనున్నారు .ఈ విషయం గురించి ఆయన ఈ రోజు ఆదివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి అధికారకంగా ప్రకటించారు .తన పట్ల ,తన తండ్రి పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు .
కాంగ్రెస్ తరపున 2007 ,2012 వరసగా కాంగ్రెస్ తరపున గెలిచారు .అయితే వచ్చే నెల నవంబరు 9న హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.డిసెంబరు 18న కౌంటింగ్ జరగనుంది.