ఏపీలో మరో దారుణం జరిగింది ..రాష్ట్ర మంత్రి అయిన నారాయణకు చెందినా నారాయణ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్దిని అదృశ్యమవడం ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తుంది . అంతే కాదు ఏకంగా మంత్రి నారాయణ విద్యాసంస్థలను మూసేయండి అని లేఖ పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో చదువుతున్న సాయి ప్రజ్వల ఈ లేఖ రాసింది. 11 వ తేదీన కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ
కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో తెలిపింది.