Home / SLIDER / టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది యువతి, యువకులు ఈ రోజు స్థానిక మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వ పనితీరు చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నరని,అన్ని వర్గాల ప్రజలు టి.ఆర్.ఎస్ లో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు.కే.సి.ఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను మైనార్టీల కోసం షాది ముబారక్, ఓవర్సీస్ స్కాలర్ షిప్,మైనార్టీ రెసిడెన్సిల్ స్కూల్స్,ఆటో స్కీమ్స్, బ్యాంక్ సబ్సిడీ లోన్స్ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు.కే.సి.ఆర్ గారు మైనార్టీల సంక్షేమానికి అహర్నిషలు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఎన్నికల సమయంలో చేసిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట చెందిన అహమద్ ఖాన్, మహమ్మద్ వాజీద్, అబ్దుల్ ఖాదర్, ముబీన్,టీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సుల్తాన్ ఖాద్రీ గారు మరియు టీ.ఆర్.ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat