ఇండియన్ టెలికాం రంగంలో జియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే .మొదలెట్టిన అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులకు చేరువైంది జియో.. ఈ క్రమంలో జియో కు చెందిన గతంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్కు నష్టాలను మిగిల్చించి. ఈసారి జియో కు సంబంధించి వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు జియో లాభాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తొలిసారిగా జియో ఆదాయాలను వెల్లడించారు. వడ్డీలు, పన్నులు చెల్లించకముందు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రూ.260 కోట్ల లాభాలను ఆర్జించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.జియోకు రూ.2వేల కోట్ల దాకా నష్టాలు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తె కేవలం రూ.271 కోట్లు మాత్రమే నష్టం రావడం సానుకూలాంశమేనని జియో కంపెనీ భావిస్తోంది