Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు ప‌త‌నం మాతోనే..!

చంద్ర‌బాబు ప‌త‌నం మాతోనే..!

ఎన్నిసార్లు ఆక్వాపార్క్‌ను త‌ర‌లించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్‌కు విన్నించినా.. త‌మ విన్న‌పాల‌ను వినీ..విన‌న‌ట్టు పెడ‌చెవిన పెడుతున్నార‌ని, ప్ర‌జాభిప్రాయాల ఇష్టానుసారం పాల‌న సాగించ‌లేని చంద్ర‌బాబు ప‌త‌నం మాతోనే మొద‌ల‌వుతుంద‌ని తుందుర్రు ఆక్వా బాధితులు.. చంద్ర‌బాబు పాల‌న‌పై పెద‌వి విరుస్తున్నారు.

ఆక్వాపుడ్‌ పార్కును వేరే ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, పైగా మహిళలను సైతం పోలీసుల ద్వారా దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వాపార్క్ బాధితులు. చంద్రబాబు మాయమాటలు చెప్పి గెలిచాక నట్టేట ముంచుతున్నార‌న్నారు. వృద్ధులు, మ‌హిళ‌ల‌పైనా అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌ని గ్రామ‌స్తులు వాపోయారు. ఈ ఆక్వా పార్క్ నిర్మాణంతో గ్రామాలు కాలుష్య భారిన ప‌డుతున్నాయ‌ని, త‌మ త‌ల్లిలాంటి ఊరిని పాడు చేయొద్ద‌ని విన్న‌వించినా గ్రామాల సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌మ విన్న‌పాల‌ను పెడ చెవిన పెడుతున్నార‌న్నారు. చంద్ర‌బాబునాయుడు అణ‌చిత‌వేత‌తో తాము తీర‌ని మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నామ‌న్నారు.
కాగా ఈ రోజు ఆక్వా పార్క్‌ను త‌ర‌లించాల‌ని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమ‌ర‌ణ దీక్షను పోలీసులు భ‌గ్నం చేశారు. అంత‌టితో ఆగ‌క వారిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే, నాలుగు రోజులుగా ఆమ‌ర‌ణ‌దీక్ష చేస్తున్న బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌కుండా.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డంతో ప్ర‌జా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat