తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఆయన మీడియా సమావేశం పెట్టి మరి తనపై వస్తోన్న వార్తలను ఖండించపోగా తానూ పార్టీ మారడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు .ఆ వార్తలు నిజమే అన్నట్లు ఆయన ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అని తెలుగు మీడియా వార్తలను ప్రచురించింది .
ఆ క్రమంలో రేవంత్ ఏపీ టీడీపీ నేతలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ “ఏపీ తెలుగు తమ్ముళ్ళపై రాకెట్లు పేల్చారు .ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి జైళ్ళో పెడుతుంటే అక్కడ నేతలు మాత్రం ఆయనకు వంగి వంగి దండాలు పెడుతున్నారు అని విమర్శించారు .
ఇటివల రాష్ట్రంలో జరిగిన మంత్రి పరిటాల సునీత తనయుడి వివాహానికి వెళ్ళిన సమయంలో కేసీఆర్ కు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. మరి, చంద్రబాబు.. సీతక్క కుమారుడి పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ నాయకులు అలానే చేశారా? ఏపీలో పయ్యావుల కేశవ్ను ప్రజలు తిరస్కరించారు. అలాంటాయన నాపై విమర్శలు చేస్తాడా?’’ అని ఆయన ప్రశ్నించారు.