Home / POLITICS / టీటీడీపీకు మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు సీనియర్ నేతలు గుడ్ బై ..

టీటీడీపీకు మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు సీనియర్ నేతలు గుడ్ బై ..

తెలంగాణ టీడీపీ పార్టీకు షాకుల షాకులు తగులుతున్నాయి .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం అలోమోస్ట్ పునాదులు కూడా పెకిలిపోయి ఉన్న టీడీపీ పార్టీకి అంతో ఇంతో బలాన్నిచ్చే టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నది .అదే ప్రస్తుతం గత మూడున్నర ఏండ్లుగా పార్టీలో క్రీయశీలకంగా ఉన్న నేతలు రేవూరి ప్రకాష్ రెడ్డి ,వేం నరేందర్ రెడ్డి ,గండ్ర సత్యనారాయణ ,మాజీ ఎమ్మెల్యే సీతక్క కూడా టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి . రేవంత్ రెడ్డికి అది నుండి అనుచరవర్గంగా ఉంటూ వస్తోన్న  వీళ్ళంతా రేవంత్ తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నప్పుడు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలో పడ్డారు అని సమాచారం .

ఉన్న ఆశ రేవంత్ కూడా పార్టీకి గుడ్ బై చెప్తే తెలంగాణ లో టీడీపీ మరో కామ్రేడ్ పార్టీ అవుతుంది తప్ప అధికారం కాదు కదా కనీసం గెలవలేము అని గ్రహించిన వీరంతా త్వరలోనే వరంగల్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి .వచ్చే నెలలో రాహుల్ సభ జరగనున్నది అని భావిస్తున్న తరుణంలో అప్పటివరకు వేచి చూడాల్సిందే ..?.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat