అనుపమ పరమేశ్వరన్ పేరుకి మలయాళీ పిల్లే కాని స్వచ్చమైన తెలుగులో అచ్చంగా మాట్లాడుతూ తక్కువ టైం లోనే తెలుగు వాళ్ళ మనసులు దోచేసింది. నిన్న విడుదలైన ఉన్నది ఒకటే జిందగీలో చేసింది ఫస్ట్ హాఫ్ రోల్ చిన్నదే అయినప్పటికీ రామ్ తో సమానంగా తనే అందరికి గుర్తుండిపోతోంది. తన పెర్ఫార్మన్స్ తో యూత్ మనసులు గెలిచేసుకుంది.
సినిమా సక్సెస్ రేంజ్ ఇంకా బయటపడలేదు కాబట్టి ఇది తనకు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడం గురించి ఇప్పుడే చెప్పలేం కాని తనలో నటిని ఇంకాస్త మెరుగు పరచడంలో మాత్రం దర్శకుడు తిరుమల కిషోర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా యాక్టివ్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్న అనుపమ తాజాగా బిబిసి తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది.
తన కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడే బ్యాచులు తనకు కూడా ఎదురు పడేవని, కాలేజీ బస్సులో, వీకెండ్లో హాస్టల్ నుంచి ఊరికి వెళ్ళడానికి అయిదారు గంటలు పట్టే ఆర్టిసి బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు విపరీతమైన రద్దీ ఉండేదని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మగాళ్ళు తనను తాకే ప్రయత్నం చేయటం, రాసుకుంటూ వెళ్ళడం ఇవన్ని నరకప్రాయంగా ఉండేవని చెప్పింది. చాలా సార్లు ఇలా చేసిన వాళ్ళకు తాను వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంది. సగటు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో అనుపమ మాటల్లో మరోసారి తేటతెల్లమైంది.