Home / ANDHRAPRADESH / వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇది నిజంగా శుభవార్త .ఈ నెల ఆరో తారిఖు నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట మహా పాదయాత్రను నిర్వహించనున్న సంగతి విదితమే .

అందుకు తగ్గట్లు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి.అందులో భాగంగా వైసీపీ జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అనుమతి తప్పనిసరి అని తెలిపామని అన్నారు.

వైసీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat