టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కుమారి 21 ఎఫ్తోనే హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. అందంతో కట్టిపడేసి నటనతో మెప్పించడంతో సిని జనాలే కాకుండా. ఇండస్ర్టీ కూడా ఆమెకు దాసోహం అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. హెబ్బా కూడా చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా…సబ్జెక్ట్ బాగా ఉన్న చిత్రాలను చేసుకుంటూ.. కెరీయర్ను సాగించింది. మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినా ఇంకా చాన్సులు వస్తూనే ఉన్నాయి హెబ్బా పటేల్కు.
ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్గా సెటిల్ అయింది. ఇలా కథానాయికగా మంచి ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లు.. చాలా వరకు టాలీవుడ్లోనే సెటిల్ అయిపోయారు. ఇక్కడే ఇల్లు కొనుక్కుని ఓ వైపు సినిమాలు చేస్తూ… మరో వైపు బిజినెస్ చేసుకుంటున్నారు. హెబ్బా కూడా వారి బాటలోనే నడుస్తుందని, ఇక్కడే ఇల్లు కొనుక్కుని సెటిల్ అవుతుందని అనుకున్నారంతా.. కానీ ఈ అమ్మడు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. ముంబైలో ఆల్రెడీ ఇల్లు రెడీ చేసుకుంది.
ఈ విషయం చెప్పింది మరెవరో కాదు. స్వయంగా హెబ్బానే. సొంత నగరంలోనే ఉండాలని ఇష్టమని, అందుకే ముంబైలో ఇల్లు కొన్నానని తెలిపింది. దీంతో తెలుగోళ్లు ఖంగుతిన్నారు. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడంతో ఇక్కడే సెటిల్ అవుతుందనుకుంటే ముంబైలో ఇల్లు తీసుకుందేంటి అని షాక్లో ఉన్నారు. ఏదైతేనేం ఈ అమ్మడు కూడా ఓ ఇంటిది కావడంతో ఫ్యాన్స్ కాస్త హ్యాప్పీగానే ఉన్నార్లేండి. ఇల్లు ఎక్కడ తీసుకుంటేనేం సినిమాలైతే చేస్తుంది కదా! అనే ధీమాతో ఉన్నారు హెబ్బా పటేల్ అభిమానులు.