తెలుగు వెండి తెరపై కేరళ కుట్టీల హవా నడుస్తోంది. ఇప్పటికే కీర్తీ సురేష్ అనుపమా పరమేశ్వరన్లు వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. మరో భామ లైన్లోకి వచ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశమే న్యాచురల్ స్టార్ నానితో రావడం ఆచిత్రం సక్సెస్ కావడం.. ఆతర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్రత్ర చిత్రం పర్వాలేదనిపించింది.
దీంతో అమ్మడికి తర్వాతి అవకాశం ఏకంగా పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ పవన్ నటించే చిత్రంలో ఈ క్యూట్ భామకి సెకండ్ హీరోయిన్ చాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హాట్ భామకి మలయాళం ఇటు తమిళం కన్నాతనకి టాలీవుడ్ అంటేనే ఇష్టమని చెబుతోంది. అను అన్ని అనుకున్నట్టు జరిగితే నేను హైదరాబాద్ లోనే సెటిల్ అవుతానంటోంది.
అను మాట్లాడుతూ నాకు టాలీవుడ్ బాగా నచ్చింది… అందుకే నేను ఇక్కడే సినిమాలు చేస్తా అంటుంది అను. మళ్లీ మలయాళం ఇండస్ట్రీకి వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. మరి తమిళ సినిమా చేయడం వెనక రీజన్ ఏంటనే ప్రశ్నకు… కేవలం రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడం వల్లనే కోలీవుడ్లో సినిమా చేశానని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది అను ఎమ్మాన్యుయేల్. ఇకపై మాత్రం అలాంటి ప్రయోగాలు చేయనని, క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తానని అంటోంది. ఇక తమిళ్లో ఆమె నటించిన తుప్పరివాలన్ సినిమా తెలుగులో డిటెక్టివ్ పేరిట విడుదలకు సిద్ధమైంది.