వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు.
వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే ఉద్యోగాలు రావడం లేదని, నిరుద్యోగ భృతి రావడం లేదని, రైతులైతే పంటలు సరిగ్గా పండటం లేదని, పండిన పంటలకు సర్కారు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ వారి వారి సమస్యలను జగనన్నకు చెప్పుకుంటున్నారు. ప్రజల సమస్యలు వింటూ.. కష్టాలు చూస్తూ.. జనానికి ధైర్యం చెబుతూ జగన్ ముందుకు సాగుతున్నారు.
అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ తలపెట్టిన యాత్రలో చివరి వరకు పాల్గొనేందుకు వచ్చిన అభిమానులు మీడియాతో మాట్లాడుతూ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. వారి వారి నియోజకవర్గాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న అరాచకాలను మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంలోనే.. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణరెడ్డి గురించి.. ధర్మవరం నియోజకవర్గ వ్యక్తి మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యే సూరిగాడు ఒక దొం. నా..– అంటూ విరుచుకుపడ్డాడు. ప్రభుత్వం తమదే కదా అని.. నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబు కూడా ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమని తన ఆవేదనను వెలిబుచ్చాడు. రానున్న ఎన్నికల్లో జగనన్న ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అప్పుడే ప్రజలంతా సుఖ సంతోషాలతో.. అవినీతి రహిత పాలనతో జీవిస్తారని అన్నారు.
కాగా, మొదటి రోజు సక్సెస్ ఫుల్గా ముగిసిన జగన్ పాదయాత్ర.. రెండోరోజూ విజయవంతంగా సాగుతోంది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ రోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు.