తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు .
ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం సిద్ధిపేట ను కూడా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న నియోజక వర్గంగా నిలపడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు .ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకు ఆంధ్రాలో స్వాగత కటౌట్లు పెట్టారు .
రేపు అనగా నవంబర్ 10 ఏపీ రాజధాని మహానగరం అమరావతిలో రాష్ట్ర తొలి శాటిలైట్ న్యూస్ ఛానల్ ఏపీ 24*7 ఛానల్ ప్రారంభోత్సవం జరగనున్నది .ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల తో పాటుగా తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారు .ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ ప్లేక్సీ లు ,కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు మంత్రి హరీష్ రావు అభిమానులు ..