పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుకుమార్ మెగా అభిమానుల కోసం ఓ మెగా టీజర్ను రిలీజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్కు సంబంధించి ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.
అయితే,
రామ్ చరణ్ ప్రతీ సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడని అభిమానులు సైతం విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీరంతా వేగంగా సినిమాలు చేస్తుంటే చరణ్ మాత్రం తన తదుపరి చిత్రం ఏదో ముందే ఫిక్స్ అయినప్పటికీ దానిని సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నాడు. ధృవ, రంగస్థలం చిత్రాలు అనుకున్న సమయానికంటే బాగానే డిలే అయ్యాయి. ఈ ఏడాదిలో అయితే, అసలు చరణ్ సినిమానే రిలీజ్ కాలేదు. ఈ విషయంపై అభిమానుల నుంచి రామ్చరణ్కు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయని సమాచారం. అభిమానుల కంప్లైంట్స్ విన్న చరణ్ ఇక తన తదుపరి చిత్రాలకు ఇలా జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడట.
ఇకపోతే.. రంగస్థలం పూర్తయ్యేలోగా బోయపాటి శ్రీను సినిమాను లైన్లో పెట్టాడు రామ్చరణ్. కొరాటల శివతో సినిమా కన్ఫామ్ అయినాకానీ.. అది కాస్త ఆలస్యం అవుతుందని తెలిసి చరణ్ ఈ సినిమాను ఓకే చేశాడు. రంగస్థలం పూర్తయ్యేలోగా.. బోయపాటి చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తికానున్నట్లు సమాచారం. ఇక దీంతో ఈ చిత్రం ఆలస్యం లేకుండా సెట్స్ మీదకు వెళ్లనుంది.
అయితే, సైరా నరసింహారెడ్డి నిర్మాణ వ్యవహరాలను చూసుకునేందుకు రామ్ చరణ్ ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశాడట. ఆ చిత్రం వల్ల తన సినిమా షెడ్యూల్స్ అప్సెట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాదిలో చరణ్వి రెండు సినిమాలు కచ్చితంగా రాబోతున్నాయి. ఇక అలాగే ఆ వెంటనే కొరటాల శివ చిత్రం కూడా సెట్సఠ్ మీదకు వెళ్లబోతోంది. ఇక రామ్చరణ్ ఇదే స్పీడ్ను కొనసాగిస్తే టాలీవుడ్ నె.1 హీరోగా మారడం ఖాయం. ఇక రామ్ చరణ్ ఇదే స్పీడ్తో దూసుకెళ్తే రికార్డ్స్ బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి టాలీవుడ్లో ఇదే న్యూస్ హాట్ టాపిక్గా మారింది.