వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలిపారు. జనసేనలో పవన్ ఒక్కరు మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని అన్నారు. డిసెంబర్ తొలివారం తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని మహేందర్ రెడ్డి అన్నారు.