ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు.
ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించింది. దానికి తగు వివరణను కూడా స్పీకర్తో సమావేశం అయ్యి వైసీపీ నేతలు ఇచ్చారు. ఫిరాయింపు బ్యాచ్ పై వేటు వేస్తేనే అంసెంబ్లీకి వస్తామని చెప్పారు వైసీపీ నేతలు. వారిపై ఎటువంటి చర్యలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడారు. అయితే జగన్ పై సెటైర్లు వేధ్దామనుకున్న చంద్రబాబు జగన్కు సంబందించి ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకపోవడం పెద్ద వార్త కాదని.. జగన్ అసెంబ్లీలో ఉంటే చేసేది అల్లరేనని చంద్రబాబు అన్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు పై కామెంట్లు విసురుతున్నారు. చంద్రబాబు చానాళ్ళకు ఒక నిజం ఒప్పుకున్నారని.. ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అల్లరోడు అనే మాటని వాడడం ఎంత కరెక్ట్ అని.. అయినా అల్లరోళ్ళు ఎప్పుడైనా మోసం చేయరని.. మీలాంటి పెద్దమనుషులు లాగే పెకి చెలామణి అవుతున్నవారే మోసం చేస్తారని.. జగన్ మనసులో ఉన్నదే మాట్లాడుతాడని మీలా ప్రజలను మోసం చేస్తూ పెకి ప్రజా సేవకుడినని చెప్పే రకం కాదని సోషల్ మీడియాలో చంద్రబాబు పై కౌంటర్లు వేస్తున్నారు.