ప్రస్తుత ఆధునిక రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది .దాని పరిష్కారం కోసం పలు చిట్కాలు పాటిస్తారు .అవసరమైతే పెద్ద పెద్ద ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు .ఒకానొక సమయంలో అయితే ఎంత ఖర్చు చేయడానికి అయిన వెనకాడరు .అంతగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు .అయితే ప్రస్తుత రోజుల్లో బాగా వేదించే సమస్య కిడ్నీ లలో రాళ్లు .
ఈ సమస్య తీరడానికి తిరగని ఆస్పత్రి ఉండదు ..ఎక్కని దేవుడు మెట్లు ఉండవు .అయితే సహజంగా లభించే బొప్పాయి పండులో ఎన్నో ఔషధగుణాలున్నాయి అని సైంటిస్టులు చెబుతున్నారు . భోజనం చేశాక బొప్పాయి తింటే అది చాలా సులభంగా జీర్ణమవుతుంది. అంతే కాదు అంట మూత్రపిండాలతో రాళ్ళు అరికట్టేందుకు బొప్పాయి ఎంతగానో దోహద పడుతుంది.
బొప్పాయి ఆకులతో చేసిన జ్యూస్ తాగితేప్లేట్లేట్స్ సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారికి ఈ జ్యూస్ తాగమని చెబుతారు. బొప్పాయి ఆకులను మెత్తగా దంచి పసుపుతో కలిపి పట్టువేస్తే బోధకాలు తగు తుంది. ఈ ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజనీస్ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. అయితే బొప్పాయి ఆకుల్లోఉండే విటమిన్-సి, విటమిన్-ఎలు చర్మం ఆరోగ్యంగా, ఎంతో కాంతివంతంగా ఉండటంలో సహాయపడుతుంది అంట .