తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్లోని సామ నరసింహరెడ్డి గార్డెన్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె తెలిపారు . ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా గర్భిణిల ఖర్చు కోసం నాలుగు విడతల్లో రూ. 12 వేలు ఇస్తున్నామని కూడా తెలిపారు.