Home / NATIONAL / ఆర్బీఐ సంచలన నిర్ణయం …

ఆర్బీఐ సంచలన నిర్ణయం …

దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు పెద్దన్నగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ,దివ్యాంగులు ఏటీఎం ల వద్ద క్యూలో గంటలు తరబడి నిలబడి మనీ డ్రా చేసుకుంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాము .

ఒకానొక సమయంలో ఏటీఎం లవద్ద జనం తాకిడి తట్టుకోలేక క్యూలోనే కూలబడుతూ అనారోగ్యానికి గురవుతున్న వార్తలు కూడా ఇప్పటివరకు చాలానే ప్రసారం జరిగింది .అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ..వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే లక్ష్యంతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది .

దీంతో ఈ ఏడాది డిసెంబర్ 31 నుండి సీనియర్ సిటిజన్లు ,దివ్యాంగులు క్యూలో నిలబడకుండా ఉండే అవసరం లేకుండా వారికి ఇంటి వద్దనే బ్యాంకులు ప్రాధమిక సర్వీస్లను అందించాలని ఆదేశాలను జారీచేసింది .దీనిప్రకారం నగదు స్వీకరించడం ,డెలవరి చేయడం ,చెక్ బుక్స్ ,డిమాండ్ డ్రాఫ్ట్ లు ,కేవైసీ డాకుమెంట్స్ సమర్పించడం ,లైఫ్ సర్టిపికెట్లు అందించడం వంటి సర్వీసులను ఇంటి వద్దనే అందించాలని ఉత్తర్వులను జారీచేసింది .ఈ సేవలు అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలనీ కూడా సూచించింది .అయితే వీటికి ఎంత మొత్తంలో చార్జీలను విదిస్తారో ప్రకటించలేదు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat