Home / ANDHRAPRADESH / జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఆ సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్యారడైజ్ పేపర్ల లీకుల్లో హెరిటేజ్ పేరు వచ్చినా.. దాని గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారని అభిప్రాయపడ్డారు.పోలవరం, ప్రత్యేక హోదా లాంటి కీలకాంశాలను పక్కనపెట్టి కేవలం కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. రాజధాని, పట్టిసీమ, పుష్కరాలు, సదావర్తి భూములు, ఇసుక సహా అన్నింటిలోనూ అవినితీ, దోపిడిలకు పాల్పడ్డారు. ఓటుకు కోట్లు కేసు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుగా ఉంది.

అవినీతిలో కూరుకుపోయిన ఏపీ సీఎం, మంత్రులు జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ముందుగా పార్టీ మారిన మంత్రులను డిస్మిస్ చేసి, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి. ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న యనమలకు న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌కు డాక్యుమెంట్‌కు తేడా తెలియదా అని’ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat