Home / Uncategorized / మార్నింగ్ వాకర్స్‌తో షటిల్‌ ఆడిన కడియం..

మార్నింగ్ వాకర్స్‌తో షటిల్‌ ఆడిన కడియం..

వివిధ పనులతో నిత్యం తీరిక లేకుండా ఉండే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్‌లో ఉల్లాసంగా గడిపారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌తో కలిసి ఉదయం వాకింగ్ కి వచ్చారు. కొంతసేపు వాకింగ్‌ చేసిన అనంతరం వాకర్స్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడారు. అనంతరం అయన మీడియా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాకర్స్‌ కోసం మైదానంలో సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానం ట్రాక్స్‌ను ఒక అందమైన ట్రాక్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .

ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో ఉదయాన్నే వాకర్స్ తో చర్చిస్తున్న ఉపముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి,మేయర్ శ్రీ నన్నపునేని నరేందర్,ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ బాస్కర్,కుడా చైర్మన్ శ్రీ మర్రి యాదవరెడ్డి…

Posted by Nannapuneni Narender Warangal on Saturday, 11 November 2017

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat