తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం ,బూర్గంపాడు మండలాల్లో వెయ్యి కుటుంబాలు టీఆర్ఎస్ గూటికి చేరారు .జిల్లాలో అశ్వాపురం మండలంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు కంచుకోట అయిన మొండికుంట ,నెల్లిపాక బంజర ,రామచంద్రాపురం నుండి నాలుగు వందల యాబై కుటుంబాలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాయి .
ఇక బూర్గంపాడు మండలంలో ఇరవెండి పంచాయితీ పరిధిలోని మోతే ,చింతకుంట గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన నాలుగు వందల కుటుంబాలు ,మణుగూరు మండలం రామనుజవరంలో నూట యాబై కుటుంబాలు టీడీపీ ,సీపీఐ నుండి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కారెక్కరు .