సీన్1ః రేవంత్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రోజు(గతనెల 28న) రాత్రి కోడంగల్కు చేరుకున్నారు. ఉదయం కొడంగల్లోని వెంకటేశ్వర ఆలయంకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్రెడ్డి దంపతులు నందారం అనురాధ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.
సీన్ 2ః నందారం ప్రశాంత్ చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిలు అనునిత్యం ప్రశాంత్ను వెంటబెట్టుకొని ఉంటున్నారు.
ఎవరీ నందారం అనురాధ? ప్రశాంత్..రేవంత్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వారికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారనే కదా మీ సందేహాం. అది అర్థం కావాలంటే…కొడంగల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి.
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంకు ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకుడు నందారం వెంకటయ్య. ఆయనకు గతంలో తెదేపా టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది. నందారం వెంకటయ్య మరణాంతరం ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణకు సైతం తెదేపా ఎమ్మెల్యేగా గెలిపిం చింది. నందారం కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారి మంచితనం.. అవినీతి రహిత పాలన అక్కడి ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ప్రజల్లో వారికి చక్కటి సానుభూతి వచ్చింది. ప్రమాదంలో నందారం సూర్యనారాయణ ఎమ్మెల్యే హోదాలో మరణించారు. దీంతో కొడంగల్లో ఈ కుటుంబానికి ప్రజలు మరింత దగ్గరయ్యారు. ఆతరువాత తెదేపా కోడంగల్ సీటును రేవంత్రెడ్డి చేతిలో పెట్టింది.
మరోవైపు నందారం సూర్యనారాయణ భార్య నందారం అనురాధ క్రియాశీలకంగానే ఉన్నారు. సూర్యనారాయణ సోదరుడు నందారం శ్రీనివాస్ కుమారుడు నందారం ప్రశాంత్ కోడంగల్ రాజకీయాలలో మరింత కీలకంగా మారిపోయారు. కొడంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గంకు భారీ ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో…రేవంత్ ఆ కుటుంబాన్ని కాకపట్టేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.