Home / MOVIES / ఆ నిర్మాత నన్ను చాలా వేధించాడు -ధన్సిక సంచలన వ్యాఖ్యలు ..

ఆ నిర్మాత నన్ను చాలా వేధించాడు -ధన్సిక సంచలన వ్యాఖ్యలు ..

కబాలి మూవీలో నటించిన ప్రముఖ నటి ధన్సిక తన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది .ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో మాట్లాడిన ధన్సిక ఈ విషయం తెలిపారు .ఆమె మాట్లాడుతూ “ప్రముఖ తమిళ హీరో శింబు తండ్రి ,ప్రముఖ నిర్మాత టి రాజేందర్ నన్ను మానసికంగా వేధించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .

సరిగ్గా రెండు నెలల కిందట రాజేందర్ తనను ఒక మీడియా సమావేశంలో అందరి ముందు అవమానించి మాట్లాడారు .తొలుత వేదికపై మాట్లాడిన ఆమె అందరికి ధన్యవాదాలు చెప్పి ,తన పేరును ప్రస్తావించలేదని ఆయన ఆమెపై విమర్శలకు దిగారు .మర్చిపోయాను అని క్షమాపణలు చెప్పిన కానీ ఆయన పట్టించుకోలేదు .అయితే ఆ సమయంలో రాజేందర్ తనపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్న ఆయన్ని ఆపడానికి మిగిలిన చిత్రం యూనిట్ ప్రయత్నించకపోవడం గమనార్హం .

అయితే అప్పట్లో ఈ సంఘటన పెను సంచలనం సృష్టించింది .దీనిగురించి ఆమె తాజాగా స్పందిస్తూ నేను అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణమైన ఈ సంఘటన గురించి చెప్పకూడదు అనుకున్నాను. కానీ రాజేందర్ ఆధ్యాత్మిక వ్యక్తీ అని అందరు భావిస్తారు కానీ ఆయన అలా కాదు .అలాంటి వాడు ఎవరైనా సరే అరవరు .కానీ అతను మాత్రం ఒక మహిళ అని చూడకుండా తీవ్ర దూషణలకు దిగారు .ఆయన వలన నేను మానసికంగా కృంగిపోయాను ..చాలా రోజులు బయటకు రావడానికి కూడా చాలా భయపడ్డాను అని ఆమె అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat