ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు ఏండ్లుగా అంటే 2014 ,2015 ,2016 కుగాను అత్యుత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించింది .ఎప్పుడు అయితే బాబు సర్కారు నంది అవార్డులను ప్రకటించిందో అప్పటి నుండి ఇంట బయట విమర్శల పర్వం కురుస్తుంది .నంది అవార్డులు కేవలం టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఇచ్చారు .
అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అని ..పచ్చ అవార్డులు అని ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విమర్శిస్తున్నారు .తాజాగా నంది అవార్డుల ప్రకటనపై మెగా నిర్మాత అశ్వనీదత్ స్పందించారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు నంది అవార్డులు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించడంలేదు .అయితే జ్యూరి సభ్యుల ఎంపికలో టీడీపీ సర్కారు తప్పు చేసింది అని ఆయన అభిప్రాయపడ్డారు .లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి మూవీ “మనం”కు నంది అవార్డు ఇచ్చి ఉంటె బాగుండేది అని ఆయన అన్నారు .