రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .త్వరలో గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చి ..రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు పునాది వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది .
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన ఎన్సీపీ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఎన్సీపీ ఈ రోజు సోమవారం పార్టీ అధికారిక ప్రకటనను వెలువరించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలసి బరిలోకి దిగాలని మొదట భావించిన కానీ ఆ పార్టీతో చర్చలు మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి .ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని… అందుకే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని
నిర్ణయించామని ప్రకటించింది.అయితే 77 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఎన్సీపీ ఈ
నిర్ణయానికి వచ్చింది.