ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువవడం ..సమయానికి 108 వాహనం రాకపోవడంతో కాలినడకన ఆస్పత్రికి బయల్దేరిన గర్భశోకం మిగిలింది .నడుస్తుండగానే ప్రసవం జరగడంతో పుట్టిన మగబిడ్డ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు .ఇలాంటి దారుణమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురంలో చోటు చేసుకుంది .
వెంకటాపురం మండలంలో మద్దిమడుగు అటవీప్రాంతంలో గొత్తికోయాల గూడేనికి పద్దామ్ చంద్ ,మంగమ్మ దంపతులు .వెంకటాపురం సమీపంలోని జంగారెడ్డిగడ్డలో రేకుల షెడ్డు వేసుకొని నివాసం ఉంటున్నారు .నిన్న సోమవారం ఉదయం మంగమ్మకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి బయల్దేరింది .
వీరు వెంకటాపురం నుండి 108 వాహనంలో ములుగు ఆస్పత్రికి వెళ్ళాల్సి ఉంది .నొప్పుల తీవ్రమవుతుండంతో గమనించిన స్థానికులు రైతులు బొమ్మెడ సాంబయ్య ,బిక్షపతి వారిని ఎడ్లబండిలో వెంకటాపురానికి తీసుకొచ్చారు .ఈ క్రమంలోనే వారికి 108 కి కాల్ చేశారు .అయితే నొప్పులు బాగా రావడంతో ములుగు ఆస్పత్రికి బయల్దేరారు .ఈ సమయంలో ఆమె ప్రసవించడంతో శిశువు కింద పడి తల పగలడంతో మృతి చెందాడు .దీంతో ఆ తల్లి రోదనను ఎవరు ఆపలేకపోయారు .