Home / ANDHRAPRADESH / నువ్వు మంత్రి కావ‌డం మా ఖ‌ర్మ‌.. లోకేష్ పై విరుచుకు ప‌డిన పోసాని..!

నువ్వు మంత్రి కావ‌డం మా ఖ‌ర్మ‌.. లోకేష్ పై విరుచుకు ప‌డిన పోసాని..!

ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించి నంది అవార్డుల ర‌గ‌డ చిలికి చిలికి గాలి వాన‌లి మారుతోంది. 2014,15,16 సంవ‌త్స‌రాల‌కు గాను ఒకేసారి నంది అవార్డులు ప్ర‌క‌టించ‌డం.. ఇందులో కొంత‌మందికి అవార్డులు రావ‌డంపై మ‌రికొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్ర‌బాబుతో పాటు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.
నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల పై సినీ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని ముర‌ళీ కృష్ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.. అని ప్ర‌శ్నించారు. లోకేశ్ నువ్వు చదువుకున్నవాడివేనా.. నీకు బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా.. మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా.. ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా… మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు అంటూ నిల‌దీశారు. నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే… తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా.. అప్పుడు ఆయ‌న్ని నాన్ లోక్ అన్నారా అని లోకేష్ పై పోసాని విరుచుకు ప‌డ్డారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat