అసలు మనం మానవీయ సమాజంలో ఉన్నామా? అంటూ మనుషుల రూపంలో ఉన్న పశువులు చేసిన పనులు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరికి ఇటువంటి ప్నశ్నే తలెత్తుతుందన్న మాట వాస్తవం. మరీ కొంచెం లోతుగా ఆలోచిస్తే.. మన చుట్టూ ఉన్నది అసలు మనుషులేనా? అని ప్రశ్నించుకోక తప్పదు. అయితే, ఓ వాచ్మెన్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం ఇటువంటి వాడిని ఎన్నింటితో పోల్చినా తక్కువే అని అంటారు. కారణం కూడా అదే స్థాయిలో ఉంది మరీ.
ఇంతకీ కాపలా ఉండాల్సిన ఆ వాచ్మెన్ కాటేశాడు. చిన్నారుల నుంచి పద్నాలుగేళ్ల బాలికల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డాడీ వాచ్మెన్. ఏకంగా 7మంది బాలికలను తన పశువాంఛకు బలి చేశాడు. ఇది వినడానికే నీచంగా ఉంది కదా!. ఈ ఘటనకు ఒడిగట్టిన దౌర్భాగ్యుడు హైదరాబాద్ నగర పరిధిలోగల కాప్రాకు చెందిన వాడు కావడం గమనార్హం.
వివరాలిలా ఉన్నాయి.. కాప్రాలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. కాపలా ఉండాల్సిన వాచ్మెన్ అభం శుభం తెలియని ఏడో తరగతి విద్యార్థినులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుగురు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. మరో ఇద్దరి అమ్మాయిలపై కూడా వేధింపులకు పాల్పడ్డాడు ఈ వాచ్మెన్. ఈ విషయం కాస్తా వెలుగులోకి రావడంతో అప్రమత్తమైంది స్కూలు యాజమాన్యం. ఘటనపై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో వాచ్మెన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో వాచ్మెన్ అఘాయిత్యాలు మరెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి మరి.