ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .
అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు .రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజక వర్గానికి చెందిన ఆయన కొద్ది రోజుల కిందట టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి పార్టీలోకి చేరతాను అనే విషయం తెలిపారు .
ఈ క్రమంలో ఈ రోజు ఆయన అధికారకంగా టీడీపీ పార్టీలో చేరనున్నారు .ఆయనతో పాటుగా పీలేరు నియోజక వర్గానికి చెందిన అరవై మంది సర్పంచులు ,పెద్ద సంఖ్యలో ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ,ఇతర కార్యకర్తలు చేరనున్నారు అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి .అంతే కాకుండా పార్టీ మారినందుకు కిషోర్ కుమార్ రెడ్డిను పీలేరు నియోజక వర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు టీడీపీ వర్గాలు కోడై కూస్తున్నాయి .