Home / MOVIES / పూజా హెగ్దేకు చిర్రెత్తుకొచ్చిన వేళ‌!

పూజా హెగ్దేకు చిర్రెత్తుకొచ్చిన వేళ‌!

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంతో త‌న గ‌త చిత్రాల‌కంటే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూజా హెగ్దే. అయితే, ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ హీరోగా, స‌మంత హీరోయిన్‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రంగ‌స్థ‌లం మూవీలో ఓ ఐటెంగ్ సాంగ్ చేస్తోంది. అంతేకాదు.. ఈ అమ్మ‌డు చేతిలో మ‌రో రెండు భారీ ప్రాజెక్టు కూడా ఉన్నాయి. ఒక‌టి.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా తెర‌కెక్కుతున్న సాక్ష్యం చిత్రం, మ‌రొక‌టి.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల ఈ అమ్మ‌డు ఓ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా.. త‌న‌కు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం న‌డుస్తోందంటూ చెప్పుకొచ్చింది. అయినా చెడ్డ రోజుల‌తో తాను పోరాడుతాన‌ని.. అనుకున్న‌ది సాధిస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే, తాను ఆ మాట‌లు అన‌డానికి గ‌ల కార‌ణాల వెనుక ఉన్న అస‌లు ఆంత‌ర్యం మాత్రం వెల్ల‌డించ‌లేదు ఈ హాట్‌ భామ‌. అయితే, పూజా హెగ్దేకు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం న‌డ‌వ‌డానికి కార‌ణం వంశీ పైడ‌ప‌ల్లి అని అనుకుంటురు సినీ జనాలు. మ‌హేష్‌బాబు – వంశీ పైడ‌ప‌ల్లి కాంబోలో వ‌స్తున్న ఓ చిత్రంలో మొద‌ట హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు వ‌చ్చిన‌ప్ప‌టికి త‌రువాత ర‌కుల్ ప్రీత్‌సింగ్ పేరు విన‌ప‌డ‌టంతో చిర్రెత్తుకొచ్చిన ఈ భామ ఇలా వ్యాఖ్య‌లు చేసిన‌ట్టోంది బ‌హుశా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat