ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబందించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా సామాజిక మాధ్యమాలలో మై ఓట్ టుడే ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఏంటంటే దేశంలో ఉన్న అత్యంత చెత్త ముఖ్యమంత్రి ఎవరో ప్రజలే తెల్పాలంటూ ఓటింగ్ను నిర్వహించింది. అయితే ఇది క్వార్టర్ఫైనల్ మాత్రమే అని తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్ ఉంటుందని చెప్పారు. అయితే తాజా క్వార్టర్ ఫైనల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయభేరి మోగించే దిశగా దూసుకుపోతున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ కందు 23శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉండగా.. బీహార్ ముఖ్యమంత్రి 31శాతం ఓటింగ్తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక చంద్రబాబు మాత్రం 33శాతం ఓటింగ్తో మొదటి స్థానంలో ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంలో మేమంతా చంద్రబాబుకు సపోర్ట్ చేస్తామని.. 90శాతం ఓట్లతో ఆయన్ని ఎలాగైనా గెలిపిస్తామని పోస్టులు పెడుతున్నారు.