Home / ANDHRAPRADESH / ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?

ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి మరి తెల్సుకోవడమే కాకుండా వాటిని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను ..త్వరలోనే మీ అందరి ఆశీస్సులతో రాజన్న పాలన వస్తుంది అని ఆయన హామీ ఇచ్చుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు .

జగన్ పాదయాత్రలో భాగంగానిన్న గురువారం కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో ఆస్సరి మండలం కారుమంచి నుండి ఇరవై రెండో రోజు పాదయాత్రను కొనసాగించారు .ఇరవై రెండో రోజు మొత్తం పదిహేను కిలోమీటర్లు నడిచారు .బిలేకల్లు లో రాత్రి జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను పందులను కొన్నట్లు ముఖ్యమంత్రి ,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొంటున్నారు .అమ్ముడుపోయే వారికి నోట్ల కట్టలు ..పోర్టులు ,పదవులు ఇచ్చి లోబరుచుకుంటున్నారు ఆయన విమర్శించారు .

అయితే వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కొంటె వైసీపీ పార్టీ ఉండదు అని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు ..నాడు వైసీపీ పార్టీని స్థాపించిన సమయంలో వైఎస్ జగన్ ,జగన్ తల్లి వైఎస్ విజయమ్మ మాత్రమే ఉన్నారు .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,తొమ్మిది మంది ఎంపీలను గెలిపించుకున్న సత్తా నాది .ఎమ్మెల్యేలు పొతే ఇంకా మంచి అభ్యర్ధులను నిలబెట్టి మరి గెలిపించుకునే సత్తా నాకు ఉంది .ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబు వలన ఓడిపోతారు తప్పా వాళ్ళ వలన కాదు .వాళ్ళు అమాయకులు అని ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు జగన్ .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat