తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .
అయితే అతను టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అని ఆయన అన్నారు .గురువారం సహచర మంత్రి లక్ష్మారెడ్డి ,ఎంపీ జితేందర్ రెడ్డి పాలమూరు జిల్లాలో కోస్గి లో యాదవులకు గొర్రెలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నేను టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో తను కూడా వస్తాను అని తెలిపారు .
అయితే ఈ విషయం గురించి నా సహచర మంత్రుల ,నేతల దృష్టికి తీసుకెళ్ళాను .అంతే కాకుండా పాలమూరు జిల్లాకు చెందిన నేతలు ,మంత్రులు దృష్టికి కూడా తీసుకెళ్ళాను .అయితే వారు వాడొక పెద్ద దొంగ .అలాంటి వాళ్ళను నమ్మి చేర్చుకుంటే సర్వనాశనం అని తెలిపారు .ఇక్కడ చోటు దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .